My site provides Vastu and Jathakam ....

Friday, 20 September 2019

గ్రహదోషనివారణకు సుందరకాండ పారాయణము

గ్రహదోషనివారణకు 
సుందరకాండ పారాయణము 

సోమస్య చే ద్దశా   దుష్టా తస్యా శాంత్యర్థ మాదరాత్ ,
 ‘తత స్స మధ్యంగత ' మి త్యముం సర్గం పఠే న్ని శి ,
శుక్లపక్షే ప్రదోషే చ తత శ్చంద్రం ప్రపూజయేత్ . 
చంద్రమహాదశ అనుకూలముగ లేకున్నచో ' తత స్స మధ్యం గత . . . ' ఇత్యాది శ్లోకముతో మొదలగు సుందరకాండ పంచమసర్గను శుక్లపక్షమున చీకటి పడుట తోడనే మొదలు పెట్టి ప్రతిదినము పారాయణ చేయవలెను . పిమ్మట చంద్రుని పూజింపవలెను ,

కుజదశా దోష నివారణకు 

గురో శ్చే ద్దోషదా భుక్తి ర్భౌమస్య తు దశాంతరే , 
ఉపదేశం హనుమతో రావణస్య తదా పఠేత్ . 
కుజమహాదశలో గుర్వంతర్దశ దోష ప్రద మగుచో హనుమంతుడు రావణునకు చేసిన యుపదేశము (51వ సర్గ) పారాయణ చేయనగును .

 శుక్రభుక్తి  ర్దోషదా చే ల్లోహితాంగ దశాంతరే , 
సీతాయాః ప్రార్థనం వహ్ని ముద్దిశ్య హనుమత్కృతే , 
యత్ర తం సర్గ మాధ్యాయ న్నాంజనేయం పఠేత్ క్రమాత్ 

కుజమహాదశలో శుక్రాంతర్దశ ప్రతికూలముగ నున్నచో , నపుడు సీతాదేవి హనుమంతుని కొఱకై యగ్ని ప్రార్థనము చేసిన ఘట్టము ( 58 వ సర్గ) ను ఆంజనేయుని ధ్యానించుచు పఠింపవలెను . 

రాహుదశా దోష నివారణకు 

కవే ర్భుక్తి రనర్థా చే తైసం త్సైం  హికేయ దశాంతరే , 
హనూమతా రాఘవాయ చూడామణ్యర్పణం ప ఠేత్ . 

రాహుమహాదశలో గుర్వంతర్దశ కష్టములు కలిగించుచున్నచో హనుమంతుడు రామునకు చూడామణిని సమర్పించు ఘట్టము ( 65వ సర్గ పారాయణ చేయవలెను . 

శనైశ్చరస్య భుక్త్యాం చే ద్దోషో  రాహుదశాంతరే , 
హనూమతాక్ష నాశాఖ్య సర్గ పారాయణం చరేత్ . 

రాహుమహాదశలో శన్యంతరము క్లేశ కరముగనున్న చో హనుమంతు . డక్షరాక్షసుని సంహరించుఘట్టము ( 47 వ సర్గ ) పారాయణ చేయవలెను .

గురుదశా దోషనివారణకు 

గురో ర్దశా చే దుగ్రా స్యా త్తథా సుందరకాండకే , 
పఠే త్సముద్రతరణసర్గ మేకం హనూమతః , 
అంతే చ సీతయా మిశ్రాన్ లా జాన్ హనుమతేర్పయేత్.  

గురుమహాదశ లో కష్టము లకు గురియగుచున్నచో హనుమంతు , సముద్రము దాటు ఘట్టము ( 1వ సర్గ ) పారాయణ చేయుచు , పారాయ ణాంతమున చక్కెర కలిపిన పేలాలను నివేదించవలెను . 

కేతు భుక్త్యాం  భవే త్పీడా గురో ర్యది దశాంతరే ,
 పఠే న్మధువనధ్వంస సర్గ ద్వయ మనుత్తమమ్ . 

గరుదశలో కేత్వంతరము పీడాకరమగుచో వానరులు మధువనము ధ్వంసము చేయు ఘట్టము ( 61 , 62 సర్గలు ) పారాయణ చేయవలెను .

 శనిదశా దోష నివారణకు 

శనేర్గశాయాం భుక్తి శ్చే చ్చనేరే వాహితా భవేత్ ,
 బ్రహ్మాస్త్ర బంధముక్త్యాఖ్యం పఠే త్సర్గం హనూమతః . 

శనిమహాదశ లో శన్యంతర్దశ కష్టములు కలిగించు చున్నచో  హను మంతుడు బ్రహ్మాస్త్రబంధము నుండి విముక్తి నొందిన ఘట్టము ( 46వసర్గ పారాయణ చేయవలెను . 

శనే ర్దశాయాం సౌమ్యస్య భుక్తి శ్చేత్ క్లేశ దాయినీ , లంకాదాహం హనుమతా కృతం సర్గం తదా పఠేత్ . 

శనిమహాదశలో బుధాంతరము క్లేశములు కలిగించుచున్నచో , హను మంతుడు లంకను తగులబెట్టు ఘట్టము ( 54 వసర్గ  ) పఠించవలెను .

శనే ర్ధకాయాం శుక్రస్య భు క్తి ర్యది విపత్ర్పదా,  
 చూడామణి ప్రదానాఖ్యం పఠే త్సర్గం హనూమతే . 

శనిమహాదశలో శుక్రాంతరమున బాధలు కలుగుచో హనుమంతు సీతాదేవి చూడామణి నిచ్చిన ఘట్టము ( 38వ సర్గ ) పఠించవలెను .

 బుధదశాదోష నివారణకు 

దశా బుధస్య దుష్టా చేత్ సీతాగ్రే హనుమత్కృతం , శ్రీరామవర్ణనం సర్గం పఠే. త్సంపూజ్య రాఘవమ్ , పఠనాంతే రాఘవస్య ముద్గాన్నం విని వేదయేత్ . 

బుధమహాదశ క్లేశకరముగ నున్న చో రాముని పూజించి సీతాదేవి యెదుట హనుమంతు డొనర్చిన రామవర్ణన ఘట్టము ( 35వ సర్గ పఠింప వలెను.) పారాయణానంతరము పొంగలి నివేదింపవలెను . 

బుధస్య చే ద్దశాయాం తు భౌమభుక్తిస్తు పీడయేత్ సీతాశుభ నిమిత్తాఖ్యం సర్గం షడ్వార మాపఠేత్ . 

బుధమహాదశలో కుజభుక్తి బాగుగాలేనిచో సీతాదేవికి కుభశకునము లగ పడుట అను ఘట్టము ( 27వ సర్గ ) ఆరుమారులు పారాయణ చేయవలెను 

కేతుభుక్తి  ర్దోషదా చే దుృధస్యాథ దశాంతరే
 హనూమతా శోక వనే  సీతాన్వేషణ మాపఠేత్ . 

బుధమహాదశలో కేతుభుక్తి  పీడాకరముగ నున్నచో , హనుమంతు డశోకవనమందు సీతాదేవిని వెదకుట యను ఘట్టము ( 14 వ సర్గ ) పఠించవలెను .


కేతుదశా దోషనివారణకు 

శుక్రభుక్త్యాం తు దోష శ్చే  త్కేతో రేవ దశాంతరే , హనూమదుక్తం రామాయ సీతాదర్శన మాపఠేత్ . 

కేతుమహాదశలో శుక్ర  భుక్తి బాధలు కలిగించుచో హనుమంత రామునకు చెప్పిన - సీతాసందర్శన ఘట్టము ( 65 వ సర్రసర్గ) పారాయణ చేయవలెను . 


శుక్రదశా దోష నివారణకు 

తత్ర్పెవ  శుక్రభుక్తి  శ్చేత్ ప్రాణినాం దోషకారిణీ , 
అంగుళీయ ప్రధానస్య సర్గం సుందరకాండజం , 
పతే తొషవణం భక్త్యా పూజయిత్వా మహీసుతామ్ . 

శుక్రమహాదశ యందలి శుక్రాంతరమున కష్టములు కలుగుచున్న చో సుందరకాండ మందలి హనుమంతుడు సీతాదేవికి అంగుళీయక ( ముద్రికా ) ప్రదానము చేసిన ఘట్టము ( 36వ సర్గ మూడు పూటలును స్నానము చేసి సీతాదేవిని ధ్యానించి పఠించవలెను . 

సా చే ద్భు క్తి రోషదా స్యాత్ స్త్రీణాం తత్త్రెవ  కాండ కే , 
సీతాయా ఆంజనేయేన సంవాదస్య తు సర్దకం , శృణుయు స్తా అర్థతశ్చ శబ్దతశ్చ ద్విజాననాత్ .

 స్త్రీలకు ఈ శుక్రమహాదశయందు శుక్రాంతరము దుష్టముగా నున్నచో వారు బ్రాహ్మణుని వలన సీతాదేవి ఆంజనేయునితో మాటలాడు ఘట్టము 33 వ సర్గ అర్థముతో గూడ వినవలయును .