రథ
సప్తమినాడు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం
వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో
చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. పాలతో పాయసం చేసి
సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్యుడి చిత్రపటానికి అలంకరణ
చేసి పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి,
సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్య
నమస్కారాలు చేయాలి . రథ సప్తమినాడు స్నాన
దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ
జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ
రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబు లో గోధుమలు పోసి బ్రాహ్మణునికి
దానం చేయాలి. అయితే ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం చేయడం ఉత్తమం
సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్ ||
108 మార్లు పారాయణం చేయాలి.
అదిత్య హ్రుదయం పారాయణం చేయాలి
రథసప్తమి రోజు సూర్య ఉదయం సమయంలో స్నానం చేస్తూ దిగువ శ్లోకం చదువుకోవాలి
ReplyDeleteఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి
అనంతరం
సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర
సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ
చదువు కోవాలి