My site provides Vastu and Jathakam ....

Saturday, 28 December 2019

ధనుర్మాసం

  ఆండాళ్ ఆరాధన 


ధనుర్మాసం అంటే  ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో  తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. కోరికలు ఈడేరడానికి  ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో  తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం  అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. 
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది.  మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది.  మాసానాం మార్గశీర్షం  అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.

-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*

Thursday, 19 December 2019

సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం

 సూర్యగ్రహణం -  షష్ఠగ్రహకూటమి ప్రభావం

డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది.  ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.  
 సూర్యగ్రహణం ప్రభావం మనపైన పడకుండా ఉండటానికి జాగత్త పడితే వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతో సత్ ఫలితాలు సాధ్యం.

లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹
  

సూర్యగ్రహణం - ఆయా రాశులపై  ప్రభావం

 మేష రాశి:-
 గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది ఇది మిశ్రమ ఫలితాలకు దారితీస్తుంది. . తొమ్మిదో స్థానం భాగ్య స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన  ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. 
 వృషభ రాశి:-
గ్రహణం 8వ స్థానంలో సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది. సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో  జాగ్రత్త!
మిధున రాశి:-
 గ్రహణం 7వ  స్థానంలో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి సంబంధించినది. 
 వైవాహిక జీవితంలో,  వ్యాపార భాగస్వామ్యాల విషయంలో పట్టుదల తగదు. 
కర్కాటక రాశి:-
గ్రహణం 6వ  స్థానంలో సంభవిస్తుంది. 6వ  స్థానం అనుకూల స్థానం. వృత్తిలోఅనుకూల ఫలితాలు.  కోర్టు కేసులు,  వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి:-
 గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు.  బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.  
కన్య రాశి:-
 గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది. 4వ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు సంబంధించినది. ఇక్కడ కూడా వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలు ఉన్నాయి.  ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. 
తులా రాశి:- 
గ్రహణం మూడవ స్థానంలో సంభవిస్తుంది. 3వ స్థానం అనుకూల స్థానం.   చేపట్టిన పనుల్లో విజయం సాధించే
అవకాశాలు ఉన్నాయి. 
వృశ్చిక రాశి:- 
 గ్రహణం 2వ స్థానంలో సంభవిస్తున్నది.2వ  స్థానం ధనానికి, కుటుంబానికి,  మాటకు సంభందించినది. జాగ్రత్త అవసరం. వాదప్రతివాదాలు తగదు
.ధనస్సు రాశి:- 
 గ్రహణం 1వ స్థానంలో సంభవిస్తున్నది.  ఇది అనుకూల  స్థానంకాదు.  తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మకర రాశి:- 
 గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ  స్థానం ఖర్చులకు,  విదేశీ యానానికి,  ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 
కుంభ రాశి:- 
గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం. అనుకూల స్థానం.  అన్ని శుభఫలితాలే. 
మీన రాశి:-
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి,  పేరు ప్రతిష్టలకు సంబంధించినది.  వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం. 

షష్ఠగ్రహకూటమి

ధనస్సురాశిలో షష్ఠగ్రహకూటమి సంభవించనుంది. ఇదే సమయంలో గ్రహణ సంభవం యదృర్శిచికం .గ్రహణం సంభవిచే ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా షష్ఠగ్రహకూటమి ప్రభావం ఉంటుంది.
ధనస్సురాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్న ఆరు గ్రహాలు గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు . 2019 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో  షష్ఠగ్రహకూటమి సంభవించనుంది
2019 డిసెంబర్ 28 నుంచి 2020 జనవరి 1 వరకూ గురు, శని, కేతు, సూర్య,  బుధులు అయిదు గ్రహాలు కలసి ధనస్సురాశిలో ఉంటాయి. ఈ 15 రోజుల ఫలితాలు విశ్లేషిస్తే ఆలోచించే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 
గ్రహకూటమి ప్రయాణాన్ని గమనిస్తే తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి వెళ్లగా, మిగిలిన నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. 
ఇక్కడ గురు - శనుల పాత్ర ముఖ్యమైనది. ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో గురు - శనులు కలుస్తారు.
గురు - శనులు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  మార్పులు తధ్యం. గతంలో జరిగాయి. ఎందుకంటే గురు, శని గ్రహాల గమనంతోనే  జాతకంలో మార్పులు జరుగుతాయి.  ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనస్సు రాశి తోపాటు, ధనస్సుకు ఎదురుగా ఉండే మిధునరాశికి కూడా సమాన ఫలితాలు ఉంటాయి. రాశులకు సంభంధించిన దేశాలలో కూడా మార్పులు, నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి ధనస్సు రాశి ద్వాదశ ఫలితం ఉంటుండి, అదేవిధంగా అమెరికాను సూచించే మిధునరాశి ధనస్సుకు ఎదురుగాఉండటాన్ని గమనించి జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో లగ్నసమయం గుర్తించే విధానము

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా లగ్నం రాశిని ఎలా గుర్తించాలి? సాధారణంగా ఇది అందరికీ కలిగే సందేహమే. అమెరికాలో నేటి ఉదయం ఏలగ్నం. అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఆలోచన మొదలవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తిముగా సూర్యుడే ప్రామాణికం అని గ్రహించాలి.
పన్నెండు రాశులు 12 లగ్నములు. అవి 1 ) మేషము 2 ) వృషభము 3 ) మిధునము 4 ) కర్కాటకం 5 ) సింహం 6 ) కన్య 7 ) తుల 8 ) వృశ్చికం 9 ) ధనస్సు 10 ) మకరం 11 ) కుంభం 12 ) మీనం
రోజుకు 24 గంటలు. అంటే 12 లగ్నములు ప్రతిరోజూ ఉంటాయి. ప్రతిలగ్నం సమయం రెండుగంటలు
 పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి.
ఉదాహరణ: ఒక రోజు  ఉదయం 06-05 నుండి 08-04 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.
తరువాత ఏలగ్నం?
ఇంకేమిటి ఉంటుంది?
మకరం తరువాత కుంభమే  కదా! :- ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ఏ లగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు?
మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు? సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.
నక్షత్రాలు - రాశులు
నక్షత్రాలు - రాశులు

      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ 

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.



అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

Tuesday, 10 December 2019

పంచకరహితము

పంచకరహితము అంటే...


శ్లో . తిథివారోడుభిర్యు క్తం తత్కా  లోదయమిశ్రితం
 నవసంఖ్యా హ రేద్భాగం శేషంపంచక మీరితమ్.

వివాహముహూర్తం తిథి వార నక్షత్రముల సంఖ్యను మొత్తము చేసి యప్పటి సంఖ్యను చేర్చి 9 చే భాగించవలెను . అట్లు భాగించగా మిగిలిన శేషము 3, 5, 7, 9 సంఖ్యలలో వొకటి వచ్చినా పంచకరహితమైనట్లు గ్రహించవలెను
ఉదా : - వివాహముహూర్తము చైతశుద్ధదశమినాడు అని అను కొందము . ఆనాడు తిధి నవమి . వారము బుధవారము . నక్షత్రము రోహిణి . లగ్నము కన్య  . తిథి నవమి  9 + వారము 4 + నక్షతము 4 + లగ్నము 6 + మొత్తము 23 ను 9 చే భాగించిన 5 వచ్చినది.  పంచకరహితమైనదిగా నిర్ణయింపవలెను .

పంచకరహితఫలములు

శ్లో . ఏకో మృత్యుర్ద్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో ఇష్ట రోగస్స్ల్యాది  త్యేత త్పంచకం స్మృతం

 శేషము వచ్చిన సంఖ్య దిగువ ఉదహరించిన విధముగ ఫలితములు ఉండును
 1 . మృత్యుపంచకము దీనియందు వివాహము చేసిన వధూ వరులకు మరణప్రాప్తియగును .
2 . వహ్ని పంచకము - దీనియందు వివాహ మొనర్చిన అగ్ని చే  ఆపదకలుగును .
4 . రాజ పంచకము - దీనియందు వివాహ చేసిన  రాజకీయసంబంధమైన చిక్కులు కలుగును .
6 . చోర పంచకము - దీనియందు వివాహము చేసిన సొత్తు దొంగలపాలు అగును.
8 . రోగ పంచకము - దీనియందు వివాహమొనరించిన వధూవరులు రోగయుక్తులై బాధలను అనుభవింతురు .

మరో ముఖ్య విషయం కొన్ని సందర్భాలలో కొన్ని పంచకములను వదలివేయవలెను
ఆదివారమునాడు రోగ పంచకమును, శనివారమునాడు మృత్యుపంచకమును, మంగళవారమునా అగ్ని పంచకమును, సోమ, గురువారములందు రాజపంచకమును బుధశుక్రవారములయందు చోరపంచకమును విడువవలయను .  రాత్రిముహూర్తమునందు చోరరోగపంచకములను , పగటి ముహూర్తమునందు రాజాన్ని పంచకములను , అర్ధరాత్రి  మృత్యుపంచకమును విడువవలెను.