My site provides Vastu and Jathakam ....

Saturday, 28 December 2019

ధనుర్మాసం

  ఆండాళ్ ఆరాధన 


ధనుర్మాసం అంటే  ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో  తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. కోరికలు ఈడేరడానికి  ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో  తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం  అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. 
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది.  మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది.  మాసానాం మార్గశీర్షం  అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.

-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*

Thursday, 19 December 2019

సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం

 సూర్యగ్రహణం -  షష్ఠగ్రహకూటమి ప్రభావం

డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది.  ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.  
 సూర్యగ్రహణం ప్రభావం మనపైన పడకుండా ఉండటానికి జాగత్త పడితే వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతో సత్ ఫలితాలు సాధ్యం.

లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹
  

సూర్యగ్రహణం - ఆయా రాశులపై  ప్రభావం

 మేష రాశి:-
 గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది ఇది మిశ్రమ ఫలితాలకు దారితీస్తుంది. . తొమ్మిదో స్థానం భాగ్య స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన  ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. 
 వృషభ రాశి:-
గ్రహణం 8వ స్థానంలో సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది. సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో  జాగ్రత్త!
మిధున రాశి:-
 గ్రహణం 7వ  స్థానంలో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి సంబంధించినది. 
 వైవాహిక జీవితంలో,  వ్యాపార భాగస్వామ్యాల విషయంలో పట్టుదల తగదు. 
కర్కాటక రాశి:-
గ్రహణం 6వ  స్థానంలో సంభవిస్తుంది. 6వ  స్థానం అనుకూల స్థానం. వృత్తిలోఅనుకూల ఫలితాలు.  కోర్టు కేసులు,  వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి:-
 గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు.  బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.  
కన్య రాశి:-
 గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది. 4వ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు సంబంధించినది. ఇక్కడ కూడా వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలు ఉన్నాయి.  ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. 
తులా రాశి:- 
గ్రహణం మూడవ స్థానంలో సంభవిస్తుంది. 3వ స్థానం అనుకూల స్థానం.   చేపట్టిన పనుల్లో విజయం సాధించే
అవకాశాలు ఉన్నాయి. 
వృశ్చిక రాశి:- 
 గ్రహణం 2వ స్థానంలో సంభవిస్తున్నది.2వ  స్థానం ధనానికి, కుటుంబానికి,  మాటకు సంభందించినది. జాగ్రత్త అవసరం. వాదప్రతివాదాలు తగదు
.ధనస్సు రాశి:- 
 గ్రహణం 1వ స్థానంలో సంభవిస్తున్నది.  ఇది అనుకూల  స్థానంకాదు.  తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మకర రాశి:- 
 గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ  స్థానం ఖర్చులకు,  విదేశీ యానానికి,  ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 
కుంభ రాశి:- 
గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం. అనుకూల స్థానం.  అన్ని శుభఫలితాలే. 
మీన రాశి:-
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి,  పేరు ప్రతిష్టలకు సంబంధించినది.  వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం. 

షష్ఠగ్రహకూటమి

ధనస్సురాశిలో షష్ఠగ్రహకూటమి సంభవించనుంది. ఇదే సమయంలో గ్రహణ సంభవం యదృర్శిచికం .గ్రహణం సంభవిచే ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా షష్ఠగ్రహకూటమి ప్రభావం ఉంటుంది.
ధనస్సురాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్న ఆరు గ్రహాలు గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు . 2019 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో  షష్ఠగ్రహకూటమి సంభవించనుంది
2019 డిసెంబర్ 28 నుంచి 2020 జనవరి 1 వరకూ గురు, శని, కేతు, సూర్య,  బుధులు అయిదు గ్రహాలు కలసి ధనస్సురాశిలో ఉంటాయి. ఈ 15 రోజుల ఫలితాలు విశ్లేషిస్తే ఆలోచించే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 
గ్రహకూటమి ప్రయాణాన్ని గమనిస్తే తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి వెళ్లగా, మిగిలిన నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. 
ఇక్కడ గురు - శనుల పాత్ర ముఖ్యమైనది. ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో గురు - శనులు కలుస్తారు.
గురు - శనులు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  మార్పులు తధ్యం. గతంలో జరిగాయి. ఎందుకంటే గురు, శని గ్రహాల గమనంతోనే  జాతకంలో మార్పులు జరుగుతాయి.  ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనస్సు రాశి తోపాటు, ధనస్సుకు ఎదురుగా ఉండే మిధునరాశికి కూడా సమాన ఫలితాలు ఉంటాయి. రాశులకు సంభంధించిన దేశాలలో కూడా మార్పులు, నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి ధనస్సు రాశి ద్వాదశ ఫలితం ఉంటుండి, అదేవిధంగా అమెరికాను సూచించే మిధునరాశి ధనస్సుకు ఎదురుగాఉండటాన్ని గమనించి జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో లగ్నసమయం గుర్తించే విధానము

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా లగ్నం రాశిని ఎలా గుర్తించాలి? సాధారణంగా ఇది అందరికీ కలిగే సందేహమే. అమెరికాలో నేటి ఉదయం ఏలగ్నం. అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఆలోచన మొదలవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తిముగా సూర్యుడే ప్రామాణికం అని గ్రహించాలి.
పన్నెండు రాశులు 12 లగ్నములు. అవి 1 ) మేషము 2 ) వృషభము 3 ) మిధునము 4 ) కర్కాటకం 5 ) సింహం 6 ) కన్య 7 ) తుల 8 ) వృశ్చికం 9 ) ధనస్సు 10 ) మకరం 11 ) కుంభం 12 ) మీనం
రోజుకు 24 గంటలు. అంటే 12 లగ్నములు ప్రతిరోజూ ఉంటాయి. ప్రతిలగ్నం సమయం రెండుగంటలు
 పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి.
ఉదాహరణ: ఒక రోజు  ఉదయం 06-05 నుండి 08-04 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.
తరువాత ఏలగ్నం?
ఇంకేమిటి ఉంటుంది?
మకరం తరువాత కుంభమే  కదా! :- ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ఏ లగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు?
మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు? సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.
నక్షత్రాలు - రాశులు
నక్షత్రాలు - రాశులు

      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ 

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.



అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

Tuesday, 10 December 2019

పంచకరహితము

పంచకరహితము అంటే...


శ్లో . తిథివారోడుభిర్యు క్తం తత్కా  లోదయమిశ్రితం
 నవసంఖ్యా హ రేద్భాగం శేషంపంచక మీరితమ్.

వివాహముహూర్తం తిథి వార నక్షత్రముల సంఖ్యను మొత్తము చేసి యప్పటి సంఖ్యను చేర్చి 9 చే భాగించవలెను . అట్లు భాగించగా మిగిలిన శేషము 3, 5, 7, 9 సంఖ్యలలో వొకటి వచ్చినా పంచకరహితమైనట్లు గ్రహించవలెను
ఉదా : - వివాహముహూర్తము చైతశుద్ధదశమినాడు అని అను కొందము . ఆనాడు తిధి నవమి . వారము బుధవారము . నక్షత్రము రోహిణి . లగ్నము కన్య  . తిథి నవమి  9 + వారము 4 + నక్షతము 4 + లగ్నము 6 + మొత్తము 23 ను 9 చే భాగించిన 5 వచ్చినది.  పంచకరహితమైనదిగా నిర్ణయింపవలెను .

పంచకరహితఫలములు

శ్లో . ఏకో మృత్యుర్ద్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో ఇష్ట రోగస్స్ల్యాది  త్యేత త్పంచకం స్మృతం

 శేషము వచ్చిన సంఖ్య దిగువ ఉదహరించిన విధముగ ఫలితములు ఉండును
 1 . మృత్యుపంచకము దీనియందు వివాహము చేసిన వధూ వరులకు మరణప్రాప్తియగును .
2 . వహ్ని పంచకము - దీనియందు వివాహ మొనర్చిన అగ్ని చే  ఆపదకలుగును .
4 . రాజ పంచకము - దీనియందు వివాహ చేసిన  రాజకీయసంబంధమైన చిక్కులు కలుగును .
6 . చోర పంచకము - దీనియందు వివాహము చేసిన సొత్తు దొంగలపాలు అగును.
8 . రోగ పంచకము - దీనియందు వివాహమొనరించిన వధూవరులు రోగయుక్తులై బాధలను అనుభవింతురు .

మరో ముఖ్య విషయం కొన్ని సందర్భాలలో కొన్ని పంచకములను వదలివేయవలెను
ఆదివారమునాడు రోగ పంచకమును, శనివారమునాడు మృత్యుపంచకమును, మంగళవారమునా అగ్ని పంచకమును, సోమ, గురువారములందు రాజపంచకమును బుధశుక్రవారములయందు చోరపంచకమును విడువవలయను .  రాత్రిముహూర్తమునందు చోరరోగపంచకములను , పగటి ముహూర్తమునందు రాజాన్ని పంచకములను , అర్ధరాత్రి  మృత్యుపంచకమును విడువవలెను.

Friday, 20 September 2019

గ్రహదోషనివారణకు సుందరకాండ పారాయణము

గ్రహదోషనివారణకు 
సుందరకాండ పారాయణము 

సోమస్య చే ద్దశా   దుష్టా తస్యా శాంత్యర్థ మాదరాత్ ,
 ‘తత స్స మధ్యంగత ' మి త్యముం సర్గం పఠే న్ని శి ,
శుక్లపక్షే ప్రదోషే చ తత శ్చంద్రం ప్రపూజయేత్ . 
చంద్రమహాదశ అనుకూలముగ లేకున్నచో ' తత స్స మధ్యం గత . . . ' ఇత్యాది శ్లోకముతో మొదలగు సుందరకాండ పంచమసర్గను శుక్లపక్షమున చీకటి పడుట తోడనే మొదలు పెట్టి ప్రతిదినము పారాయణ చేయవలెను . పిమ్మట చంద్రుని పూజింపవలెను ,

కుజదశా దోష నివారణకు 

గురో శ్చే ద్దోషదా భుక్తి ర్భౌమస్య తు దశాంతరే , 
ఉపదేశం హనుమతో రావణస్య తదా పఠేత్ . 
కుజమహాదశలో గుర్వంతర్దశ దోష ప్రద మగుచో హనుమంతుడు రావణునకు చేసిన యుపదేశము (51వ సర్గ) పారాయణ చేయనగును .

 శుక్రభుక్తి  ర్దోషదా చే ల్లోహితాంగ దశాంతరే , 
సీతాయాః ప్రార్థనం వహ్ని ముద్దిశ్య హనుమత్కృతే , 
యత్ర తం సర్గ మాధ్యాయ న్నాంజనేయం పఠేత్ క్రమాత్ 

కుజమహాదశలో శుక్రాంతర్దశ ప్రతికూలముగ నున్నచో , నపుడు సీతాదేవి హనుమంతుని కొఱకై యగ్ని ప్రార్థనము చేసిన ఘట్టము ( 58 వ సర్గ) ను ఆంజనేయుని ధ్యానించుచు పఠింపవలెను . 

రాహుదశా దోష నివారణకు 

కవే ర్భుక్తి రనర్థా చే తైసం త్సైం  హికేయ దశాంతరే , 
హనూమతా రాఘవాయ చూడామణ్యర్పణం ప ఠేత్ . 

రాహుమహాదశలో గుర్వంతర్దశ కష్టములు కలిగించుచున్నచో హనుమంతుడు రామునకు చూడామణిని సమర్పించు ఘట్టము ( 65వ సర్గ పారాయణ చేయవలెను . 

శనైశ్చరస్య భుక్త్యాం చే ద్దోషో  రాహుదశాంతరే , 
హనూమతాక్ష నాశాఖ్య సర్గ పారాయణం చరేత్ . 

రాహుమహాదశలో శన్యంతరము క్లేశ కరముగనున్న చో హనుమంతు . డక్షరాక్షసుని సంహరించుఘట్టము ( 47 వ సర్గ ) పారాయణ చేయవలెను .

గురుదశా దోషనివారణకు 

గురో ర్దశా చే దుగ్రా స్యా త్తథా సుందరకాండకే , 
పఠే త్సముద్రతరణసర్గ మేకం హనూమతః , 
అంతే చ సీతయా మిశ్రాన్ లా జాన్ హనుమతేర్పయేత్.  

గురుమహాదశ లో కష్టము లకు గురియగుచున్నచో హనుమంతు , సముద్రము దాటు ఘట్టము ( 1వ సర్గ ) పారాయణ చేయుచు , పారాయ ణాంతమున చక్కెర కలిపిన పేలాలను నివేదించవలెను . 

కేతు భుక్త్యాం  భవే త్పీడా గురో ర్యది దశాంతరే ,
 పఠే న్మధువనధ్వంస సర్గ ద్వయ మనుత్తమమ్ . 

గరుదశలో కేత్వంతరము పీడాకరమగుచో వానరులు మధువనము ధ్వంసము చేయు ఘట్టము ( 61 , 62 సర్గలు ) పారాయణ చేయవలెను .

 శనిదశా దోష నివారణకు 

శనేర్గశాయాం భుక్తి శ్చే చ్చనేరే వాహితా భవేత్ ,
 బ్రహ్మాస్త్ర బంధముక్త్యాఖ్యం పఠే త్సర్గం హనూమతః . 

శనిమహాదశ లో శన్యంతర్దశ కష్టములు కలిగించు చున్నచో  హను మంతుడు బ్రహ్మాస్త్రబంధము నుండి విముక్తి నొందిన ఘట్టము ( 46వసర్గ పారాయణ చేయవలెను . 

శనే ర్దశాయాం సౌమ్యస్య భుక్తి శ్చేత్ క్లేశ దాయినీ , లంకాదాహం హనుమతా కృతం సర్గం తదా పఠేత్ . 

శనిమహాదశలో బుధాంతరము క్లేశములు కలిగించుచున్నచో , హను మంతుడు లంకను తగులబెట్టు ఘట్టము ( 54 వసర్గ  ) పఠించవలెను .

శనే ర్ధకాయాం శుక్రస్య భు క్తి ర్యది విపత్ర్పదా,  
 చూడామణి ప్రదానాఖ్యం పఠే త్సర్గం హనూమతే . 

శనిమహాదశలో శుక్రాంతరమున బాధలు కలుగుచో హనుమంతు సీతాదేవి చూడామణి నిచ్చిన ఘట్టము ( 38వ సర్గ ) పఠించవలెను .

 బుధదశాదోష నివారణకు 

దశా బుధస్య దుష్టా చేత్ సీతాగ్రే హనుమత్కృతం , శ్రీరామవర్ణనం సర్గం పఠే. త్సంపూజ్య రాఘవమ్ , పఠనాంతే రాఘవస్య ముద్గాన్నం విని వేదయేత్ . 

బుధమహాదశ క్లేశకరముగ నున్న చో రాముని పూజించి సీతాదేవి యెదుట హనుమంతు డొనర్చిన రామవర్ణన ఘట్టము ( 35వ సర్గ పఠింప వలెను.) పారాయణానంతరము పొంగలి నివేదింపవలెను . 

బుధస్య చే ద్దశాయాం తు భౌమభుక్తిస్తు పీడయేత్ సీతాశుభ నిమిత్తాఖ్యం సర్గం షడ్వార మాపఠేత్ . 

బుధమహాదశలో కుజభుక్తి బాగుగాలేనిచో సీతాదేవికి కుభశకునము లగ పడుట అను ఘట్టము ( 27వ సర్గ ) ఆరుమారులు పారాయణ చేయవలెను 

కేతుభుక్తి  ర్దోషదా చే దుృధస్యాథ దశాంతరే
 హనూమతా శోక వనే  సీతాన్వేషణ మాపఠేత్ . 

బుధమహాదశలో కేతుభుక్తి  పీడాకరముగ నున్నచో , హనుమంతు డశోకవనమందు సీతాదేవిని వెదకుట యను ఘట్టము ( 14 వ సర్గ ) పఠించవలెను .


కేతుదశా దోషనివారణకు 

శుక్రభుక్త్యాం తు దోష శ్చే  త్కేతో రేవ దశాంతరే , హనూమదుక్తం రామాయ సీతాదర్శన మాపఠేత్ . 

కేతుమహాదశలో శుక్ర  భుక్తి బాధలు కలిగించుచో హనుమంత రామునకు చెప్పిన - సీతాసందర్శన ఘట్టము ( 65 వ సర్రసర్గ) పారాయణ చేయవలెను . 


శుక్రదశా దోష నివారణకు 

తత్ర్పెవ  శుక్రభుక్తి  శ్చేత్ ప్రాణినాం దోషకారిణీ , 
అంగుళీయ ప్రధానస్య సర్గం సుందరకాండజం , 
పతే తొషవణం భక్త్యా పూజయిత్వా మహీసుతామ్ . 

శుక్రమహాదశ యందలి శుక్రాంతరమున కష్టములు కలుగుచున్న చో సుందరకాండ మందలి హనుమంతుడు సీతాదేవికి అంగుళీయక ( ముద్రికా ) ప్రదానము చేసిన ఘట్టము ( 36వ సర్గ మూడు పూటలును స్నానము చేసి సీతాదేవిని ధ్యానించి పఠించవలెను . 

సా చే ద్భు క్తి రోషదా స్యాత్ స్త్రీణాం తత్త్రెవ  కాండ కే , 
సీతాయా ఆంజనేయేన సంవాదస్య తు సర్దకం , శృణుయు స్తా అర్థతశ్చ శబ్దతశ్చ ద్విజాననాత్ .

 స్త్రీలకు ఈ శుక్రమహాదశయందు శుక్రాంతరము దుష్టముగా నున్నచో వారు బ్రాహ్మణుని వలన సీతాదేవి ఆంజనేయునితో మాటలాడు ఘట్టము 33 వ సర్గ అర్థముతో గూడ వినవలయును .

Thursday, 15 August 2019

యజ్ఞోపవీత ధారణ విధి

యజ్ఞోపవీత ధారణ విధి
ఆచమనము ( కుడిచేతిని గోకర్ణాకృతిలో పట్టుకొని మూడు మారులు జలమును పుచ్చుకొనవలయును ) .
 ఆచమ్య   ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా  ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమ ః   ఓం విష్ణవే నమ ః ఓం మధుసూదనాయ నమః  ఓం త్రివిక్రమాయ నమ ః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమ ః ఓం హృషీకేశాయ నమ ః ఓం పద్మనాభాయ నమ ః  ఓం దామోదరాయ నమ ః ఓం సంకర్షణాయ నమ ః ఓం వాసుదేవాయనమ ః ఓం ప్రద్యుమ్నాయ నమ ః  ఓం అనిరుద్దాయ నమ ః  ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమ ః  ఓం అచ్యుతాయ నమ ః  ఓం జనార్ధనాయ నమ ః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమ ః ఓం శ్రీ కృష్ణాయ నమ ః
 ఉత్తిష్ఠను భూతపిశాచాః యేతే భూమిభారకాః
 ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఓం పృథివ్యా ః మేరో ః పృష్టఋషి ః కూర్మోదేవతా సుతలం ఛందః  ఆసనే వినియోగః   అనంతాసనాయ నమః
 ప్రాణాయామము
ప్రణవస్య పరబ్రహ్మఋషి ః పరమాత్మాదేవతా దైవీ
గాయత్రీ ఛంద ః . ప్రాణాయామే వినియోగః
ఓం భూః  ఓం భువః ఓగ్‌ం సువః  ఓం మహః ఓం జనః ఓం తపః  ఓగ్‌ం సత్యం  ఓం తత్ సవితు ర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి  ధియో యో నః ప్రచోదయాత్  ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్   సంకల్పము శ్రీ గోవింద - గోవింద - గోవింద - శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళేముహూర్తే అత్ర పృధివ్యాం జంబూద్వీపే... (దేశకాల పరిస్థితులను అనుసరించి అంటే అమెరికాలో వున్నవారు వారి ప్రాంత సంకల్పము చేయవలెను)  భరతవర్ష భరతఖండే మేరో ః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ( ఆగ్నేయ ) ప్రదేశే , శ్రీ కృష్ణా గోదావర్యోర్మద్యదేశే ( శ్రీ కృష్ణాకావేర్యోర్మద్యదేశే ) , లక్ష్మీ నివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ  అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .... నామ సంవత్సరే  .... యనే వర్ష ఋతౌ .... మాసే శుక్ల పక్షే ...... తిధౌ ...... శుభవాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ  మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ భగవాదాజ్ఞయా భగవత్ కైంకర్య యోగ్యతా సిద్ద్యర్థం శ్రౌత  , స్మార్త , నిత్య కర్మాద్యనుష్టాన , గృహస్తాశ్రమ ధర్మ సిద్ద్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే .
( అని సంకల్పము పఠించి ఎడమచేత ఉద్ధరణితో నీటిని తీసికొని కుడిచేతిలో పోసుకొని పాత్రలో విడువవలెను . )
 ఓం అపో హిష్ఠా మయోభువః  తాన ఊర్జే దధాతన  మహేరణాయ చక్షసే  యో వశ్శివ తమో రసః తస్య భాజయతే హ నః  ఉశతీరివ మాతరః  తస్మాణరంగమామ వః  యస్య క్షయాయ జిన్వథ  ఆపో జనయథా చ నః   ( అను మంత్రముతో యజ్ఞోప వీతముల పై తీర్థమును ప్రోక్షించి , శ్రీ చూర్ణముతో విష్ణు ( బ్రహ్మ ) ముడులను అలంకరించి ఎదుటనుంచుకొని )
1 . ప్రథమ తంతా ఓం అగ్నిమీళేతి ఓంకారమావాహయామి ,
2 . ద్వితీయ తంతౌ ఓం అగిందూత మితి అన్ని అవాహయామి ,
3.తృతీయ తంతా ఓం నమో అస్తు సర్పేభ్యో ఇతి సర్పం అవాహయామి ,
4. చతుర్థ తంతా ఓం సోమోధేను గ్ మితి సోమం అవాహయామి ,
 5.పంచమతంతౌ ఓం ఇదం పితృభ్య ః ఇతి పితృన్ అవాహయామి ,
6 . షష్ణ తంతా ఓం ప్రజాపతేనత్వదితి ప్రజాపతిం అవాహయామి ,
7.సప్తమ తంతౌ ఓం తవవాయవృథ ఇతి వాయుం అవాహయామి ,
8 . అష్టమ తంతౌ ఓం చిత్రందేవానామితి సూర్యం అవాహయామి ,
9.నవమ తంతా ఓం విశ్వేదేవాస ఇతి విశ్వే దేవాన్ ఆవాహయామి .
 1 . ప్రథమగ్రంథా - ఓం బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః - బ్రహ్మాణ మావాహయామి . 2 . ద్వితీయగ్రంథా - ఓం ఇదం విష్ణురితి విష్ణవేనమః - విష్ణు మావాహయామి . 3 . తృతీయగ్రంథా - ఓం కద్రుద్రాయమితి రుద్రాయనమః - రుద్రమావాహయామి . ధ్యానమ్ -
శ్లో . ముక్తా విద్రుమ హేమనీలధవళ చ్ఛాయై ర్ముఖైసీక్షణిః
     యుక్తాం ఇన్దునిబద్ధరత్నమకుటాం తత్యార్థ వర్ణాత్మికామ్
     గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
      శంఖం చక్రమథారవిందయుగళం హస్తి : వహంతీం భజే

యజ్ఞోప వీత దేవతాభ్యోన్నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి , పాదయోః పాద్యం సమర్పయామి , ముఖే ఆచమనీయం సమర్పయామి . శుద్దోదక స్నానం సమర్పయామి . ( అని తీర్ధనును ప్రోక్షించవలయును) ధూపమాఘ్రాపయామి , దీపం దర్శయామి , నైవేద్యం సమర్పయామి . ఇతి సూర్యాయ ప్రదర్శ . పూర్వవన్నిధాయ యజ్ఞోప వీతం స్పశన్ , అష్ణోత్తర శతసంఖ్యాకాం గాయత్రీ . మంత్రజపం కరిష్యే (శర్కర లేక ఫలమును ఆరగింపు చేయలయును  ) ఆచమ్య ( ఆచ మనము చేసి ) , ప్రాణానాయమ్య ( ప్రాణాయామము చేసి), (సంకల్పము చెప్పి) యజ్ఞోప వీత మంత్రస్య బ్రహ్మా ఋషిః , త్రిష్టుప్ ఛందః , వేదాః త్రయోదేవతాః శ్రీమన్నారాయణ ప్రీత్యర్దే యజ్ఞోపవీత ధారణే వినియోగః

యజ్ఞోపవీతం , పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్
ఆయుష్య మగ్య్రం ప్రతిముంచ శుభ్రమ్ యజ్ఞోపవీతం బలమస్తుతేజః

 ( అను మంత్రమును ఉచ్చరిస్తూ ఒక యజ్ఞోప వీతము బ్రహ్మముడి యొక్క కొన లు పైకి యుండునట్లు ధరించవలయును . తిరిగి ఆచమనము , ప్రాణాయామము చేసి ) గృహస్థాశ్రమ యోగ్యతా సిద్ద్యర్థం ద్వితీయయజ్ఞోపవీత ధారణం కరిష్యే ః ( అని నీళ్ళు వదలి , మరల ’ యజ్ఞోపవీతం . . . బలమస్తు తేజః ’ అనుదానిని పఠించి రెండవ దానిని ధరించవలయును . మరల ఆచమనము , ప్రాణాయామము చేసి )
‘ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
( అని నీళ్ళువదలి  యజ్ఞోపవీత . . . బలమస్తు తేజ ః అను దానిని పఠించి తృతీయ యజ్ఞోపవీతముల ముడులను 108 , లేక 11 పర్యాయములకు తక్కువ కా కుండా గాయత్రీ మంత్రజపమును చేయవలయును . తదుపరి యధాప్రకారము సంధ్యావందనం పూర్తిగావించి ఈ క్రింది మంత్రమును చదువుచు పాత యజ్ఞోపవీతమును శిరస్సు పైనుండి వెనుకకు వీపువైపునకు తీసి తీర్థం వదలవలయును . )
        ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కశ్మల దూషితమ్
        విసృజామి హరే విష్ణో , వర్చోదీర్ఘాయురస్తుమే
                 ‘ ఓం తత్సత్ శ్రీమన్నారాయణార్పణమస్తు
                                    జైశ్రీమన్నారాయణ

Wednesday, 7 August 2019

గ్రహములు రాశులలో ఉండేసమయం
ఏదైనా ఒక రాశిలో రవి 30 రోజులు
చంద్రుడు 2 1 / 2 రోజులు
కుజుడు 45 రోజులు
బుధుడు 30 రోజులు
రాహువు 18 నెలలు ( 11 / 2 సంవత్సరం)
గురుడు 12 నెలలు ( 1 సంవత్సరం)
శుక్రుడు 30 రోజులు
శని 30 నెలలు ( 21 / 2 రోజులు )
కేతువు 18 నెలలు ( 1. 1 / 2 సంవత్సరాలు)

Tuesday, 16 July 2019

శ్రీవిష్ణు సహస్రనామ - విశిష్ట - శ్లోకాలు

శ్రీవిష్ణు సహస్రనామ - విశిష్ట - శ్లోకాలు


*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే "వెయ్యి (1000)" అని అర్థం. వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది.  ఒక్కో నక్షత్రం లోని నాలుగు నాలుగు శ్లోకాలు, ఇలా 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 శ్లోకాలను ఋషులు అనుగ్రహించారు.
వీటిలో విశేష, విశిష్ట శ్లోకాలు కూడా ఉన్నాయి.
*ధనాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మంచి ఆరోగ్యానికి- విష్ణు సహస్రనామమే..*
*విద్యాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మనశ్శాంతికి- విష్ణు సహస్రనామమే..*

*ఇంతేనా..! ఇలా నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపింది మన "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం".*
 సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు  జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:*

*1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)*
*----------------------------------------*
*సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹*
*వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹*

*2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)*
*----------------------------------------*
*భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹*
*అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹*

*3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)*
*----------------------------------------*
*వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹*
*అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹*

*4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)*
*----------------------------------------*
*మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹*
*అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹*

*5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)*
*----------------------------------------*
*అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹*
*సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹*

*6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)*
*----------------------------------------*
*అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹*
*సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹*

*7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)*
*----------------------------------------*
*భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹*
*కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹*

*8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)*
*----------------------------------------*
*వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹*
*పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹*

*9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)*
*----------------------------------------*
*వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹*
*హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹*

*10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)*
*----------------------------------------*
*విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹*
*అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹*

 *11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)*
*----------------------------------------*
*యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹*
*సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹*

*12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)*
*------------------------------- ---------*
*అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹*
*శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹*

*13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)*
*----------------------------------------*
*శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹*
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹*

*14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹*
*భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹*

*15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)*
*----------------------------------------*
*సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹*
*శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹*

 *16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)*
*----------------------------------------*
*సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹*
*న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹*

*17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)*
*----------------------------------------*
*సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |*
*అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||*

*18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)*
*----------------------------------------*
*సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹*
*స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹*

*19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)*
*----------------------------------------*
*అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹*
*శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹*

*అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹*
*విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹*

*20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹*
*వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹*

*21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹*
*దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹*

****🙏 *జై శ్రీ మన్నారాయణ* 🙏

Saturday, 16 March 2019

భగవంతుడికి యజ్ఞం అంటే చాలా ఇష్టం

 మాఘ పంచమి - మా ఇంటిలో సుదర్శన హోమం


ఈ రొజు మనం అద్భుతైవెునటువంటి యజ్ఞంలో పాల్గొన్నాం.సుదర్శన హోమం అనేది  సంద్రాయంలో ఉండే వారికి అమితంగా ఇష్టపడే హోమం.భగవంతునికి ప్రేవుగా చేసేది ఏదైనా దానిని యజ్ఞము అని భగవద్గీతలో అంటారు కృష్ణపరమాత్మ. మనం చేసేపని ఏదైనా కావాచ్చు, విద్యాభ్యాసం కావచ్చు, ఉద్యోగంకావచ్చు, వ్యాపారంకావచ్చు, వ్యవసాయంకావచ్చు ఏది చేసినా సరే అది భగవంతుడికి చేసే ఒక సేవ అని ఆనుకుంటే ప్రతీపని భగవత్ సేవే అనుకుంటే దాని సేవే యజ్ఞం. దాని మీద మనకు ప్రేవుకలగాలి. అదేదో కష్టంతోకాకుండా ఇష్టంతో చేయాలి. ఇష్టం చేసేప్పుడు అదికూడా మంచి సత్‌ఫలితాలను అందిస్తుంది. భగవంతుడికి యజ్ఞం అంటే చాలా ఇష్టం. అంటే ఏపైనెనా యజ్ఞంమే ప్రేమతో చేస్తె. ఉదారహరణకి వేదపండితులు యజ్ఞం చేస్తారు. ఇది కూడా భగవంతుడి సేవ అనుకుంటే దీనిపేరే యజ్ఞం. యజ్ఞాలలో మూడురకాల యజ్ఞాలు ఉన్నాయి. అవి వాంచిత యజ్ఞాలు, రాజస యజ్ఞాలు, తామస యజ్ఞాలని మూడురకాల యజ్ఞాలు. ఈ రోజు లోకంలో అనేకపేర్లతతో యజ్ఞాలు చేస్తున్నారు. సాత్విక యజ్ఞం ఏమిటంటే ఫలితం కొంచెం ఆలస్యంగా మొదలవుతుంది. కానీ శాశ్వతంగా ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. కానీ తామస యజ్ఞాలు, రాజస యజ్ఞాలు వెంటనే ఫలితాలు ఇస్తాయి. కానీ దానివల్లనే  మళ్లీ కొన్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అలాంటి సాత్విక యజ్ఞాలలో కోర్కెలు తీర్చడానికి కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. ఏదైన గ్రహబాధలుంటే తీర్చడానికి నృసింహయుష్టి, విద్యలో రాణించాలంటే హయగ్రీవ యష్టి అని, సంతానం కోరుకునే వారికి సత్‌సంతానం కావాలంటే వైనతేయ యష్టి అనిఇట్లా ఒక్కోక్క కోరికకు ఒక్కోక్క రకాల యష్టి యాగాలు ఉన్నాయి శ్రీపాంచరాత్ర ఆగమంలో అలాగే జీవించిన వారేకాకుండా గతించినవారికి ఉత్తమ గతి కావాలన్నా, ఉన్నత మార్గంలొ వెళ్లాలన్నా లేదా మోక్షానికి పరవుపదానికి వాళ్ళువెళ్లాలన్నా, వారు సంప్రదాయంలో వాళ్లులేరు. సంప్రదాయం అంటే వారికి తెలియుదు. సమాస్రయాలు కూడా వాళ్లు కాలేదు. మంత్రోపదేశంకాలేదు. లేదావారు ఉన్నంతకాలం ఇతర మార్గాలలో ఉన్నారు. గతించిపోయారు. కానీ మనం ఇవాళ వైష్ణవ మార్గంలో ఉన్నాము. ఇవాళ పంచ సంస్కారాలు పొందాము. మంచి ఆచారున్ని మనం ఆశ్రటయించాం. ఆష్టాక్షరీ మంత్రోపదేశం మనం పొందాం. కచ్చితంగా మనకు మోక్షమే. కని వాళ్లకెట్లాగ మోక్షం?! అంటె ఇతర మార్గాలలో జీవింస్తూ గతించిన వారికి కూడా పరవుపదాన్ని ఇవ్వాలంటే, మోక్షాన్ని ఇవ్వాలంటే దానికి కూడా యజ్ఞం ఉంది. ఇలా అనేకరకాల యజ్ఞాలు ఉన్నాయి. మిగిలిన యజ్ఞాలకన్నా ఈరోజు మనం చేయించే సుదర్శన యజ్ఞం ఉందే ఇది కొంచెం భిన్నైవెునది. ఇది కొంచెం కష్టైవెునది. క్లిష్టైవెునది. ఇందాక చెప్పిన యజ్ఞాలు చదువురావాలని యజ్ఞం చేసుకోవాలన్నా, సంసారంకోసం, వివాహంకోసం మన మన కోర్కెలు తీర్చడానికోసం చేసే యజ్ఞాలు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. ఎలా అలా చేసుకోవచ్చు. ఒక్క సుదర్శన యజ్ఞంతప్ప ఈ సుదర్శన యజ్ఞం అంటే ఏమిటో తెలుసా? ముహుర్తం మనంపెట్టుకుంటే అవదు.
చాలామంది అయో మేము కూడా చేసుకోవాలండి, చేసుకోవాలండి అనుకుంటారు. ముహుర్తాలు దొరకవు.  ఎప్పుడు దొరుకుతుంది? ఆయన ఎప్పుడు ముహుర్తం అనుకుంటే అప్పుడే దొరుకుతుంది. ముహూర్తం పెట్టేది ఆయనే, నే ఫలానా వాళ్ళను పిలవాలనుకుంటున్నానండి. వాళ్ళు రారు. అనుకోకుండా ఎవరో మరొకరు వస్తారు. అంటే ఎవరితో చేయించుకోవాలో పంపించేది వారే. ముహూర్తాన్నా అందించేది వారే . ఎవరెవరిని యజ్ఞానికి రావాలనుకుంటారో రప్పించేది వారే. కనుక భగవంతుడికి ఇలాంటి యజ్ఞాలంటే చాలా ఇష్టం. అందుకే విష్ణుసహస్రనామంలో భగవంతుడికి వేయినామాలున్నాయి కదా! ఒక్కో పేరు ఒక విశేషాన్ని అందించేది. కాని యజ్ఞం అనేపేరుతో సంబంధంగా పదకొండు పన్నెండునామాలు పక్క పక్కనే ఉన్నాయి.
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ

phalguna masam

పాల్గుణ మాసం విశిష్టత

ఫాల్గుణ మాసం సర్వదేవతా వ్రత సమాహారం. చైత్రాది మాసాల క్రమంలో చివరిది ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం.  ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గునికి బుద్ధి వికాసాన్ని ధైర్య స్థిర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం.
ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథి విశేషమే!  శిశిర ఋతువుకు ముగింపు. ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది.
 ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశిగా వ్యవహరిస్తారు. చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు.
విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు  క్షీరాన్నం, లేదా పాలు నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ఆమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం.
పౌర్ణమిని ఉలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు. డోలికా పూర్ణిమ అంటారు. రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. ఫాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.

Thursday, 14 February 2019

Bheeshma Ekadasi

  భీష్మ ఏకాదశి  పర్వదినం

భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని ‘భీష్మాష్టమి‘ గాను, మాఘశుద్ధ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి‘  పర్వదినంనాడు శ్రధ్ధగా తర్పణం వదలాలి . ఈరోజు  తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని అంతేకాకుండా  పితృ దోషనివారణ, వివాహ ప్రాప్తి జరుగుతుందని విస్వాసం ధర్మరాజుకు విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని ఉద్భోదించిన పరమ పవిత్రమైన తిధి ఏకాదశి . తర్పణం వదలలేని వారు ఈ రోజు శ్రీ విష్ణువును పూజించిన వారికి కోరికలు తీరుతాయని ప్రతీతి విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని పఠించాలి.  "ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రమును 108 సార్లు జపించాలి.

తర్పణ విధానం

అథ తర్పణ ప్రయోగః ఆచమ్య | |
ప్రాణానాయమ్య | | ఏవంగుణ . . . శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , మాఘ శుక్లాష్టమ్యాం /
మాఘ ఏకాదస్య  తర్పణం కరిష్యే | |
 ఇతి సంకల్ప్య ( అని ఇట్లు సంకల్పమును చేసి తర్పణము చేయవలెను . )
1 . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | గంగాపుత్రవర్మాణం తర్పయామి | | ( 3 సార్లు )
2 వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | భీష్మవర్మాణం తర్పయామి | | | ( 3 సార్లు ) . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | అపుత్రవర్మాణం తర్పయామి | | సార్లు )
 భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియ :
 ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ II ( ఇతి తర్పయిత్వా ) అని మరొకమారు తిలోదకమును విడువవలెను . )
 పునరాచమ్య | సవ్యేన అర్ఘ్యం దద్యాత్ |
 | ( తిరిగి ఆచమించి తూర్పుముఖముగా సవ్యముతో దేవతీర్థముద్వారా అర్ఘ్యమును ఈయవలెను . ) వసూనామవతారాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి )
2 శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) భీష్మాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) | | ఇతి  |
భీష్మతర్పణవిధిః
| | |  భీష్మతర్పణవిధిః సమాప్తము

Wednesday, 23 January 2019

కృష్ణాజినం దర్భమయించ

ఉపనయన  శుభపత్రిక శ్లోకం

కృష్ణాజినం దర్భమయించ మౌంజీ పాలాశ దండః పరిధాన శాఠీ I

యజ్ఞోపవీతంచ , దిశన్తు నిత్యం వటోశ్చిరాయుః శుభకీర్తి విద్యాః II


Monday, 7 January 2019

దేవాలయములు - వాటి ప్రత్యేకత

 దేవాలయములు - వాటి ప్రత్యేకత
వాస్తు శాస్త్రం ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి.   ఇలా ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన  ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంది. ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలం చేసిన నిర్మాణాల్లో కనిపిస్తాయి.

మాడవీధులలో విగ్రహము
ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది
పూరి జగన్నాథ స్వామి.
 చిదంబరం నటరాజ స్వామి.

ఇదీ శిల్పకళ 
కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.

భూమిపై ఆనని స్థంభములు
ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామి కోవెలలో తొమ్మిది స్తంభాల మంటపం లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.

ఒక మంటపములో రెండు నటరాజ విగ్రములు

కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.

గరుడుడి విశ్వరూపం 
కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇస్తాడు

బరువు మారే గరుడ వాహనం
కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.

కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో విగ్రహం
చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.

లింగాకారంలో మారేడు కాయలు
తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.

రంగులు మారే  శివలింగం
కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు

వింతనందీశ్వరుడు 
విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.

ఆంజనేయ విగ్రహం  ప్రత్యేకత 

ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.

విరించిపురం సమయ స్తంభము

 వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

మత్స్య అవతారామా?
 చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది

స్త్రీ రూపముతో నవగ్రహములు

ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటాయి.


Sunday, 6 January 2019

ఫలితం

 మీకుతెలుసా?

జపముఎలాచేస్తేఎంతఫలితంవస్తుంది
జపముఎక్కడచేస్తేఎంతఫలితం

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||

'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.

జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.

వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.

"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.

యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||

జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||

యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.

అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.